demonitisation: నవంబ‌రు 10 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రూ.5.92 ల‌క్ష‌ల కోట్ల న‌గ‌దు పంపిణీ చేశాం: ఆర్‌బీఐ

పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దేశంలోని బ్యాంకుల‌కు కొత్త నోట్లను వేగంగా పంపిణీ చేస్తున్నామ‌ని ఆర్‌బీఐ అధికారులు మీడియాకు తెలిపారు. నవంబ‌రు 10 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రూ.5.92 ల‌క్ష‌ల కోట్ల న‌గ‌దు పంపిణీ చేశామ‌ని వెల్ల‌డించారు. మొత్తం 2,260 కోట్ల కొత్త‌ నోట్లను పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి కొత్త నోట్లు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లకు పూర్తి స్థాయిలో కొత్త‌నోట్లు అందుతాయ‌ని పేర్కొన్నారు. అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

More Telugu News