delhi: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి అదృశ్యం కేసు: న‌జీబ్‌ స‌హ విద్యార్థుల‌కి లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష

రెండు నెల‌ల క్రితం అదృశ్యమైన ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ కేసులో అధికారులు ఈ రోజు ప‌లువురికి లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15న న‌జీబ్ అదృశ్యమవ్వక ముందురోజు అత‌డితో గొడవపడ్డ నలుగురు విద్యార్థులకు ఈ టెస్ట్ చేస్తామని పోలీసులు మీడియాకు తెలిపారు. తన కుమారుడు నజీబ్ అదృశ్య‌మైన ఘ‌ట‌న‌పై అత‌డి తల్లి ఫాతిమా నఫీజ్ గ‌త నెల‌ 26న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. అప్పటినుంచీ ఈ కేసుపై ధర్మాసనం విచార‌ణ జ‌రుపుతోంది. న్యాయ‌స్థానం పోలీసుల‌కి మ‌రిన్ని ఆదేశాలు జారీ చేసింది. స‌ద‌రు విద్యార్థి కేసును వేగంగా ఛేదించాల‌ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News