demonitisation: ఐటీ కొర‌డా.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్మోహ‌న్‌రావు ఇంట్లో సోదాలు

త‌మిళ‌నాడులో ఆదాయప‌న్ను శాఖ అధికారులు ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌పై వ‌రుస‌గా త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్శ‌ద‌ర్శి రామ్మోహ‌న్‌రావు ఇంట్లో ఐటీ అధికారులు ఈ రోజు ఉద‌యం 5.30 గంట‌ల నుంచి త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఐటీ అధికారులు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం స‌భ్యుడిగా ఉన్న శేఖ‌ర్‌రెడ్డి ఇంట్లో భారీగా న‌గ‌దు, బంగారం, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఆ దాడుల్లో స్వాధీనం చేసుకున్న‌ డాక్యుమెంట్ల‌లో రామ్మోహ‌న్‌రావుకు సంబంధించి ప‌లు వివ‌రాలు ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సీఎస్ ఇంట్లో ఐటీ అధికారుల‌ సోదాలు కొన‌సాగుతున్నాయి. త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్య‌క్తిపై ఐటీ దాడులు జ‌ర‌ప‌డం ఇదే ప్ర‌థ‌మం. ఐటీ అధికారులు అక్క‌డి మ‌రికొంత మంది ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌పై కూడా దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం.

More Telugu News