demonitisation: న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ దిశ‌గా ప్రోత్సహిస్తే పన్ను మినహాయింపు

న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ దిశ‌గా త‌మ వ‌ద్ద‌కు వచ్చే వినియోగ‌దారుల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో చిరు వ్యాపారులతో పాటు రూ.2 కోట్లు కంటే ఆదాయం తక్కువగా ఉన్న వ్యాపారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. స‌ద‌రు వ్యాపారుల‌కు విధించే పన్నులో కొంత మినహాయింపు ఇస్తామ‌ని తెలిపింది. ఐటీ చట్టం ప్ర‌కారం రూ.2 కోట్ల‌లోపు ఆదాయం పొందుతున్న వారు 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందులో రెండు శాతం త‌గ్గించి ఆరు శాతం మాత్ర‌మే ప‌న్ను వేస్తామ‌ని తెలిపింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిగా డిజిటల్‌ లావాదేవీలు జరిపితే ఈ మిన‌హాయింపు ఇస్తామ‌ని తెలిపింది.
ఇక‌ నగదుతో మాత్ర‌మే లావాదేవీలు నిర్వర్తించే వారికి ఎప్ప‌టిలాగే 8 శాతం పన్ను విధిస్తామ‌ని, ఇందు కోసం చ‌ట్టంలో మార్పులు చేశామ‌ని పేర్కొంది.

కాగా, వ్యవసాయ రుణాలను సకాలంలో చెల్లించేవారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి వెసులుబాటు కల్పించింది. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని మరో 60 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 

More Telugu News