forbs: 40 ఏళ్ల లోపు అత్యంత ధనవంతుల్లో జుకెర్ బర్గే నెంబర్ వన్: ఫోర్బ్స్

ప్రపంచ వ్యాప్తంగా 40 ఏళ్ల లోపు వ్యాపారవేత్తల్లో అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మేగజీన్ విడుదల చేసింది. టాప్ 40 ధనవంతులైన యువ వ్యాపారవేత్తల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో అగ్రస్థానం 50 బిలియన్ డాలర్ల సంపాదనతో ఫేస్ బుక్ అధినేత జుకెర్ బర్గ్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఇద్దరు భారతీయ వ్యాపారవేత్తలు చోటు సంపాదించుకున్నారు. బయోటెక్ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచిన వివేక్ రామస్వామి (31) 600 మిలియన్ డాలర్ల సంపాదనతో 24వ స్ధానంలో నిలిచారు. మరో వ్యాపారవేత్త అపూర్వ మెహతా 360 మిలియన్ డాలర్ల సంపాదనతో 31వ స్థానంలో వున్నారు. 

  • Loading...

More Telugu News