: ఏపీకి ‘హోదా’ రాదు!... జైట్లీ ప్రకటనే సాక్ష్యమన్న వైఎస్ జగన్!
రాష్ట్ర విభజనతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేలిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిన్న ఢిల్లీలో చేసిన ప్రకటనే ఇందుకు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఆయన తన ఎమ్మెల్యేలతో కలిసి ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని అరుణ్ జైట్లీ ప్రకటనతో తేలిపోయిందన్నారు.