: గుంటూరు జిల్లాలో టీడీపీ నేత హత్య

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు ప్రధాన పట్టణం శివారు ప్రాంతమైన ఓబులనాయుడు పాలెంలో టీడీపీ నేత వెంకటేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన గురైన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News