: నయీం పోయినా 'నయీం దందా' మాత్రం పోలేదు!

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా అతని పేరిట వసూళ్లు ఆగలేదు. నల్గొండ జిల్లాలో నయీం ట్యాక్స్ ను యథేచ్ఛగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండ హైవేపై వచ్చీపోయే వాహనాలను ఆపే పలువురు వ్యక్తులు నయీం ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్యాక్స్ చెల్లించని వాహనాల డ్రైవర్లపై దాడులకు దిగినట్టు సమాచారం. ట్యాక్స్ చెల్లిస్తే ఆ వాహనాలకు ఎరుపు రంగు స్టిక్కర్, చెల్లించని వాహనాలకు పసుపు రంగు స్టిక్కర్ అంటిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం పది తరువాత మొదలయ్యే ఈ వసూళ్ల దందా సాయంత్రం 3 గంటల వరకు యథేచ్ఛగా జరుగుతోంది. ఈ తతంగమంతా పోలీసులకు తెలిసే జరుగుతుందని, ఈ వసూళ్లలో వాటాను హోంగార్డులు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తారని వారు చెబుతున్నారు. ప్రతి రోజూ సుమారు లక్ష రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఈ వసూళ్లు సాగుతాయని వారు తెలిపారు.

More Telugu News