: భారీ ర్యాలీలు, ప్రత్యేక పూజలు!... సింధు విజయాన్ని కాంక్షిస్తూ క్రీడాభిమానుల వినూత్న కార్యక్రమాలు!

రియో ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు దేశానికి బంగారు పతకం తీసుకురావాలని కాంక్షిస్తూ క్రీడాభిమానులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ‘గో గోల్డ్ సింధు’ పేరిట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండగా, తాజాగా క్రీడాభిమానులు ఆమె విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మొన్న విశాఖలోని సాగర తీరంలో జరిగిన భారీ ర్యాలీ తరహాలో దేశంలోని పలు ప్రాంతాల్లో సింధు విజయాన్ని కాంక్షిస్తూ క్రీడాభిమానులు భారీ ర్యాలీలకు సన్నద్ధమవుతున్నారు. వెరసి దేశ వ్యాప్తంగా సింధు మేనియా మరింతగా పెరిగింది. సాయంత్రంలోగా ఈ వినూత్న కార్యక్రమాలు వాడవాడలకూ పాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News