: జప్తులో ఉన్న మాల్యా ఆస్తులను రికవరీ చేసుకోండి!... బ్యాంకులకు డీఆర్టీ ఆదేశం!

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నయామోసంతో రూ.9 వేల కోట్లను ఎలా రాబట్టుకోవాలా అంటూ తర్జనభర్జన పడుతున్న బ్యాంకులకు డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్ (డీఆర్టీ) నిన్న ఓ మంచి సలహా ఇచ్చింది. ప్రస్తుతం వివిధ కోర్టుల పరిధిలో జప్తులో ఉన్న మాల్యా ఆస్తులను రికవరీ చేసుకుని రూ.2 వేల కోట్ల మేర బకాయిలను వసూలు చేసుకోండి అని డీఆర్టీ సూచించింది. మొత్తం రుణం అంతా ఒకేసారి వసూలు కావాలన్న భావనను వీడి ప్రస్తుతం కోర్టుల పరిధిలో జప్తులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటారో, లేక అమ్ముకుని బకాయిలను జమ చేసుకుంటారో.. మీ ఇష్టం అంటూ డీఆర్టీ చేసిన సూచన బ్యాంకులకు కాస్తంత ఊరటనిచ్చేదేనని చెప్పొచ్చు.

More Telugu News