: సౌదీలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతి

సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదారాబాద్ వాసి మృతి చెందిన సంఘటన ఈరోజు జరిగింది. నగరంలోని సైదాబాద్ కు చెందిన మిర్ అసిఫ్ అలీ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో కెమికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అసిఫ్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

More Telugu News