: నేనూ బాదేస్తా... ఇప్పుడు నమ్ముతున్నాను: కోహ్లీ

ఒకప్పుడు "సిక్సర్లు కొట్టేంత బలం లేదు. అందువల్లే ఫోర్ల మీద దృష్టి పెడుతుంటాను" అని చెప్పిన కోహ్లీ, ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. సిక్సర్లు కొట్టడంలో తనకున్న సందేహాలన్నీ తీరిపోయాయని చెప్పుకొచ్చాడు. గతంతో పోలిస్తే, తన సత్తా మీద ఇప్పుడు నమ్మకం బాగా పెరిగిందని, బరిలోకి దిగిన తరువాత తొలి 25 బంతుల వరకూ బంతికో పరుగు చేస్తున్నానని వెల్లడించిన కోహ్లీ, ఆపై తానెదుర్కొనే 15 బంతుల్లో 40 నుంచి 45 పరుగులు చేయగలనని నమ్మకంగా చెప్పాడు. సిక్సులు బాదే విషయమై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు వివరించాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజనులో కోహ్లీ మూడవ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News