: రిజర్వేషన్ల విధానంపై పునఃసమీక్ష జరపాల్సిందేనంటున్న మోహన్ భగవత్

రిజర్వేషన్ల విధానంపై తాను చేసిన వ్యాఖ్యలపై పలువురి నుంచి విమర్శలు ఎదురవుతున్నా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి అదే నిర్ణయాన్ని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ల విధానంపై పునఃసమీక్ష జరపాల్సిందేనని భగవత్ పునరుద్ఘాటించినట్టు 'దైనిక్ జాగరణ్' అనే పత్రిక తెలిపింది. యూపీలోని గోరఖ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో భగవత్ మాట్లాడుతూ, రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుతమున్న విధానంలో లక్షిత వర్గాలకు లబ్ధి చేకూరడం లేదని ఆయన అభిప్రాయపడినట్టు పేర్కొంది. అందుకే రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని భగవత్ డిమాండ్ చేస్తున్నట్టు పత్రిక వెల్లడించింది.

More Telugu News