: మరో ఆరు నెలల్లో ప్రపంచంలో సగం ఇంటర్నెట్ మయం!

సాంకేతికాభివృద్ధితో ప్రపంచం దూసుకుపోతోంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక, ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పాకిపోతోంది. మరో ఆరునెలల్లో సగం ప్రపంచం ఇంటర్నెట్ వినియోగంలోకి వస్తుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం జనాభా 720 కోట్లు. యూరప్, అమెరికా వంటి దేశాల్లో 78 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, వర్ధమాన దేశాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది. పేద దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తరిస్తోంది. దీంతో రానున్న ఆరునెలల్లో సగం ప్రపంచం ఇంటర్నెట్ వినియోగించనుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

More Telugu News