: బాడ్మింటన్ లో తెలుగు తేజాలకు కాంస్య పతకాలు

కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతుండగా, తాజాగా తెలుగు తేజాలు సింధూ, గురుసాయి దత్ లు కూడా ప్రతాపం చూపారు. శనివారం నాటి క్రీడల్లో భాగంగా బాడ్మింటన్ లో సింధూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. తన ప్రత్యర్థిపై 23-21, 23-9 తేడాతో విజయం సాధించి తన సత్తాను చాటిన సింధూ కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు హైదరాబాద్ కు చెందిన గురుసాయి దత్ కూడా బాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించాడు.

More Telugu News