వైశాఖ మాసంలో మామిడి పండ్ల దానం

ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తెలుగు మాసాలలో వైశాఖ మాసం ఒకటిగా కనిపిస్తుంది. వైశాఖ మాసాన్ని మాధవ మాసమని అంటారు. ఈ మాసంలో లక్ష్మీనారాయణులను ఆరాధించడం వలన అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శ్రీమహా విష్ణువుకు 'తులసి'ని సమర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో రావిచెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం .. అనునిత్యం విష్ణు సహస్రనామాన్ని పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయి.

ఈ మాసంలో చేసే దానాలు అనేక రెట్ల ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో ఎండలు మండిపోతుంటాయి కనుక, ఈ మాసంలో మంచినీరు .. మజ్జిగ .. నిమ్మకాయ నీళ్లు .. చెరుకు రసం దానం చేయడం వలన పుణ్యరాశి పెరుగుతుంది. ఇక ఈ మాసంలో 'మామిడి పండ్లు' విరివిగా లభిస్తాయి. అందువలన బ్రాహ్మణులకు మామిడి పండ్లను దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన, సమస్త పాపాలు నశిస్తాయనేది మహర్షుల మాట.    


More Bhakti News