ఇలా చేస్తే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవట

వెలుగు ఉంటుంది .. చీకటి ఉంటుంది. అలాగే దైవశక్తి ఉంటుంది .. దుష్టశక్తి ఉంటుంది. దైవశక్తి అడుగడుగునా సాయపడుతూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. దుష్టశక్తులు అన్ని ఆటంకాలు కల్పిస్తూ నానా చీకాకులు పెడుతుంటాయి. ఇంట్లో పవిత్రమైన వాతావరణం లేనపుడు దుష్ట శక్తుల ప్రవేశం జరుగుతుందనీ, అవి ఆ ఇంటి సభ్యుల ఆరోగ్యాలపై తమ ప్రభావాన్ని చూపుతాయని అంటారు.

అలా దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే, ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధారణంగా పండుగ రోజుల్లోనే గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటారు. ఆ తరువాత అవి ఎండిపోయి ఆ గుమ్మానికి అలాగే ఉంటాయి. అలా కాకుండా ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వలన, ఆ ఇల్లు పవిత్రమై .. దుష్ట శక్తులు లోపలి అడుగుపెట్టే అవకాశం లేకుండా చేస్తాయట. అందువలన ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడాకులు కట్టడం మరిచిపోవద్దు.        


More Bhakti News