ఇలా కూడా గురుదోష నివారణ జరుగుతుంది

ఒక్కో గ్రహ సంబంధమైన దోషం కొన్ని సమస్యలను .. ఇబ్బందులను కలిగిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ బాధల నుంచి బయటపడటానికిగాను పెద్దలు సూచించిన మార్గాలను అనుసరిస్తూ వుంటారు. ఏ గ్రహ దోషమైనా .. ఆ గ్రహాన్ని శాంతిపజేయడం వలన, ప్రతికూల ఫలితాలు నివారించబడతాయని అంటారు. అలా కొంతమంది జాతకులు గురు గ్రహ దోషానికి లోనయ్యే అవకాశం ఉంటుంది.

ఈ కారణంగా వాళ్లు గురు గ్రహాన్ని శాంతింపజేయడానికిగాను వివిధ మార్గాలను అనుసరిస్తూ వుంటారు. అలాంటి మార్గాలలో అరటిపండ్లు .. బెల్లం దానం చేయడం ఒకటిగా చెప్పబడుతున్నాయి. అరటిపండ్లు - బెల్లం .. శనగపప్పు దానం చేయడం వలన, వాటిని గురువారం రోజున ఆవుకు తినిపించడం వలన గురువు ప్రీతి చెందుతాడు. గురువు ప్రీతి చెందడం వలన .. ఆయన దోష తీవ్రత తగ్గుతూ పోతుందని చెబుతుంటారు.   


More Bhakti News