పెరుగుతోన్న వీరభద్రుడు

పెరుగుతోన్న వీరభద్రుడు
దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడి జటా జూటం నుంచి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం అనేక ప్రదేశాల్లో ఆయన ఆవిర్భవించాడు. అలా వీరభద్రస్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె' ఒకటిగా కనిపిస్తుంది. కడప జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో .. భారీ నిర్మాణాలతో .. శిల్పకళతో కూడిన మంటపాలతో ఈ ఆలయం కనిపిస్తుంది.

 వందల సంవత్సరాల చరిత్ర వున్న ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా వున్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామి వారి మూర్తి పెరుగుతూ ఉండటమే అందుకు నిదర్శనమని చెబుతుంటారు. ప్రతిష్ఠ నాటికి .. ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు వున్నాయి. అందువలన ఈ  క్షేత్రం మహిమాన్వితమైనదిగా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ స్వామిని ఆరాధించడం వలన ఆపదలు .. అనారోగ్యాలు దూరమవుతాయనీ, మనసులోని కోరికలు నెరవేరతాయని భక్తులు భావిస్తుంటారు. 

More Bhakti Articles