నైవేద్యాన్ని ఆరగించిన భగవంతుడు
భగవంతుడిని అందరూ పూజిస్తూ వుంటారు ... ఆయనకి ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యాలుగా సమర్పిస్తుంటారు. భగవంతుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించినట్టుగా విశ్వసించడం జరుగుతుందేగానీ, ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఆరగించినట్టు కనిపించదు. కానీ కొంతమంది బాలభక్తులు పట్టుపట్టడంతో ఆయన నేరుగా వచ్చి నైవేద్యాలను ఆరగించక తప్పలేదు.
బాలభక్తుల పట్ల భగవంతుడికి అమితమైన వాత్సల్యం ఉంటుందని చెప్పడానికి ఈ సంఘటనలు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. 'నామదేవుడు' పాండురంగస్వామికి మహాభక్తుడు. బాలకుడిగా వున్న ఆయన ఒకసారి విఠలుడికి నైవేద్యాన్ని తీసుకువెళతాడు. భగవంతుడు నిజంగానే నైవేద్యం స్వీకరిస్తాడని అనుకున్న ఆ బాలకుడు, ఆయన రాకపోవడంతో వచ్చేంతవరకూ అక్కడి నుంచి కదలనంటూ అక్కడే కూర్చుండిపోతాడు.
పసివాడి భక్తికి మురిసిపోయిన స్వామి, ప్రత్యక్షంగా వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించి వెళతాడు. అలా బాల్యంలోనే నామదేవుడికి ఆ పాండురంగడి ప్రత్యక్ష దర్శనం లభించింది. ఇక వేంకటనాథుడు (రాఘవేంద్రస్వామి) బాలకుడిగా వున్నప్పుడు, తండ్రి పురమాయించడంతో కృష్ణుడికి నైవేద్యం తీసుకుని ఆలయానికి వెళతాడు. ఆ నైవేద్యాన్ని తినడానికి ఆయన వస్తాడని అనుకుంటాడు. ఎంతకీ రాకపోవడంతో తండ్రి తనని కొడతాడని భావించి భయపడతాడు.
వచ్చి నైవేద్యాన్ని ఆరగించమని పలువిధాలుగా ప్రాధేయపడతాడు. దాంతో ఆ స్వామి నేరుగా వచ్చి వేంకటనాథుడికి దర్శనమిచ్చి నైవేద్యాన్ని స్వీకరించి వెళతాడు. ఇలా పరమాత్ముడు బాలభక్తుల పసిమనసును అర్థంచేసుకుని వాళ్ల మనసులో గల బలమైన విశ్వాసానికి సంతోషించి అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అవి స్వామి చల్లని మనసుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి.
బాలభక్తుల పట్ల భగవంతుడికి అమితమైన వాత్సల్యం ఉంటుందని చెప్పడానికి ఈ సంఘటనలు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. 'నామదేవుడు' పాండురంగస్వామికి మహాభక్తుడు. బాలకుడిగా వున్న ఆయన ఒకసారి విఠలుడికి నైవేద్యాన్ని తీసుకువెళతాడు. భగవంతుడు నిజంగానే నైవేద్యం స్వీకరిస్తాడని అనుకున్న ఆ బాలకుడు, ఆయన రాకపోవడంతో వచ్చేంతవరకూ అక్కడి నుంచి కదలనంటూ అక్కడే కూర్చుండిపోతాడు.
పసివాడి భక్తికి మురిసిపోయిన స్వామి, ప్రత్యక్షంగా వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించి వెళతాడు. అలా బాల్యంలోనే నామదేవుడికి ఆ పాండురంగడి ప్రత్యక్ష దర్శనం లభించింది. ఇక వేంకటనాథుడు (రాఘవేంద్రస్వామి) బాలకుడిగా వున్నప్పుడు, తండ్రి పురమాయించడంతో కృష్ణుడికి నైవేద్యం తీసుకుని ఆలయానికి వెళతాడు. ఆ నైవేద్యాన్ని తినడానికి ఆయన వస్తాడని అనుకుంటాడు. ఎంతకీ రాకపోవడంతో తండ్రి తనని కొడతాడని భావించి భయపడతాడు.
వచ్చి నైవేద్యాన్ని ఆరగించమని పలువిధాలుగా ప్రాధేయపడతాడు. దాంతో ఆ స్వామి నేరుగా వచ్చి వేంకటనాథుడికి దర్శనమిచ్చి నైవేద్యాన్ని స్వీకరించి వెళతాడు. ఇలా పరమాత్ముడు బాలభక్తుల పసిమనసును అర్థంచేసుకుని వాళ్ల మనసులో గల బలమైన విశ్వాసానికి సంతోషించి అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అవి స్వామి చల్లని మనసుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి.