శ్రీ గిరిజా దేవి

శ్రీ గిరిజా దేవి
ఒరిస్సా - జాజ్ పూర్ టౌను సమీపంలోగల 'ఓడ్యాణం' అనే ప్రాంతంలో ఈ శక్తి పీఠం దర్శనమిస్తుంది. ఇక్కడ సతీదేవి 'నాభి'భాగం పడినట్టుగా చెప్పుకుంటారు. బ్రహ్మదేవుడి కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ 'గిరిజాదేవి' పేరున కొలువుదీరినట్టు స్థల పురాణం చెబుతోంది. స్థానికులు అమ్మవారిని గిరిజా దేవనీ ... బిరజాదేవని పిలుచుకుంటూ ఉంటారు.

ఇక్కడ వైతరణి అనే ఊరుతోపాటు, అదే పేరుతో పిలవబడే నది కూడా ప్రవహిస్తూ వుంటుంది. జీవుడు సూక్ష్మ శరీరంలో యమలోక ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో వైతరణి నది వస్తుంది. ఆ నది అంశగా ఇక్కడ ఈ వైతరణి ప్రవహిస్తోందని విశ్వసిస్తుంటారు. ఇక్కడ జరిగే ఆబ్దిక క్రియలు పితృ దేవతలను నరకం నుంచి బయటపడేసి స్వర్గ ప్రవేశాన్ని కలిగిస్తాయని అంటారు.

వైతరణీ నదిలోని ఓ ప్రదేశంలో 'శ్వేత వరాహ విష్ణుమూర్తి' ఆలయం వుండటం ఒక విశేషం. ఇక అమ్మవారు దుర్గాష్టమి రోజున ప్రత్యేక దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది.

More Bhakti Articles