భక్తుల విన్నపాన్ని కాదనలేని భగవంతుడు
భగవంతుడిని ఆరాధిస్తూ వెళ్లిన కొద్దీ, ఆయనతో విడదీయరాని అనుబంధం పెరిగిపోతూ వుంటుంది. దాంతో ఆయనను చూడకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. భగవంతుడికి దూరంగా భక్తుడు క్షణకాలం కూడా ఉండలేకపోతే, అలాంటి భక్తులను విడిచి ఆ భగవంతుడు అరక్షణమైనా ఉండలేడు. అంతటి కరుణామూర్తి కనుకనే ఆయన తన భక్తుల విన్నపాలను వింటూ వుంటాడు. ఆ భక్తుల సంతోషం కోసం ... సంతృప్తి కోసం తన మనసును సైతం మార్చుకుంటూ వుంటాడు.
త్యాగరాజు జీవితంలోని ఓ సంఘటన ఇందుకు ఉదాహరణగా కనిపిస్తూ వుంటుంది. శ్రీరాముడి పట్ల త్యాగరాజుకి గల అసమానమైన భక్తిని చూసి ఆ ఊళ్లో వాళ్లంతా ఆయనని ఎంతో గౌరవంగా చూస్తుంటారు. అది సహించలేకపోయిన ఆయన వదినగారు, ఆ కుటుంబాన్ని నానాఇబ్బందులు పెడుతుంది. తమ్ముడని కూడా చూడకుండా ఆ పాపంలో ఆమె భర్త పాలుపంచుకుంటాడు.
త్యాగరాజు విషయంలో సోదరుడు ద్రోహానికి పాల్పడటాన్ని క్షమించలేకపోయిన భగవంతుడు, ఆయన మంచంపట్టేలా చేస్తాడు. తన పని కూడా తాను చేసుకోలేని పరిస్థితుల్లో వున అన్నగారిని చూసి త్యాగరాజు బాధపడతాడు. ఆయనకి తాను తలపెట్టిన అపకారమే తనని ఈ దుస్థికి తీసుకువచ్చిందని ఆయన సోదరుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనారోగ్యంతో తను పడుతోన్న నరకబాధల నుంచి విముక్తిని కల్పించమని కోరతాడు.
ఆ మాటలకు త్యాగరాజు హృదయం ద్రవిస్తుంది ... తన అన్నగారి తప్పులను క్షమించి ఆయనని ఆరోగ్యవంతుడిని చేయవలసిందిగా త్యాగరాజు ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్ధిస్తాడు. భక్తుడి వినపాన్ని కాదనలేకపోయిన శ్రీరాముడు, ఆయన సోదరుడిని పూర్తి ఆరోగ్యవంతుడిని చేస్తాడు. భగవంతుడి సేవ ఎంతటి పుణ్య ఫలితాలను ప్రసాదించగలదో ప్రత్యక్షంగా తెలుసుకున్న త్యాగరాజు సోదరుడు, ఆ క్షణం నుంచి పూర్తిగా మారిపోతాడు. భగవంతుడి సేవలో తన తమ్ముడికి సాయాన్ని అందిస్తూ తన జన్మను సార్ధకం చేసుకుంటాడు.
త్యాగరాజు జీవితంలోని ఓ సంఘటన ఇందుకు ఉదాహరణగా కనిపిస్తూ వుంటుంది. శ్రీరాముడి పట్ల త్యాగరాజుకి గల అసమానమైన భక్తిని చూసి ఆ ఊళ్లో వాళ్లంతా ఆయనని ఎంతో గౌరవంగా చూస్తుంటారు. అది సహించలేకపోయిన ఆయన వదినగారు, ఆ కుటుంబాన్ని నానాఇబ్బందులు పెడుతుంది. తమ్ముడని కూడా చూడకుండా ఆ పాపంలో ఆమె భర్త పాలుపంచుకుంటాడు.
త్యాగరాజు విషయంలో సోదరుడు ద్రోహానికి పాల్పడటాన్ని క్షమించలేకపోయిన భగవంతుడు, ఆయన మంచంపట్టేలా చేస్తాడు. తన పని కూడా తాను చేసుకోలేని పరిస్థితుల్లో వున అన్నగారిని చూసి త్యాగరాజు బాధపడతాడు. ఆయనకి తాను తలపెట్టిన అపకారమే తనని ఈ దుస్థికి తీసుకువచ్చిందని ఆయన సోదరుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనారోగ్యంతో తను పడుతోన్న నరకబాధల నుంచి విముక్తిని కల్పించమని కోరతాడు.
ఆ మాటలకు త్యాగరాజు హృదయం ద్రవిస్తుంది ... తన అన్నగారి తప్పులను క్షమించి ఆయనని ఆరోగ్యవంతుడిని చేయవలసిందిగా త్యాగరాజు ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్ధిస్తాడు. భక్తుడి వినపాన్ని కాదనలేకపోయిన శ్రీరాముడు, ఆయన సోదరుడిని పూర్తి ఆరోగ్యవంతుడిని చేస్తాడు. భగవంతుడి సేవ ఎంతటి పుణ్య ఫలితాలను ప్రసాదించగలదో ప్రత్యక్షంగా తెలుసుకున్న త్యాగరాజు సోదరుడు, ఆ క్షణం నుంచి పూర్తిగా మారిపోతాడు. భగవంతుడి సేవలో తన తమ్ముడికి సాయాన్ని అందిస్తూ తన జన్మను సార్ధకం చేసుకుంటాడు.