అన్నప్రససాదమే అక్కడ లభించే అమృతం !
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తమదైన శైలిలో ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక గురువులలో 'కాశినాయన'కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మానవసేవయే మాధవసేవగా విశ్వసించి, మాధవుడిని సేవించడానికి వచ్చిన భక్తుల ఆకలి తీరుస్తూ తరించిన మహనీయుడు కాశినాయన. ఆకలితో ఉన్నవారికి .. అందుబాటులో లేనివారికి అన్నం విలువ తెలుస్తుంది. అలాంటి ప్రదేశంలో ... అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లబడే క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కాశినాయన నిర్ణయించుకున్నాడు.
ఆయన ఆలోచనలకు తగిన ప్రదేశంగా నల్లమల అడవులలోని 'జ్యోతి నరసింహస్వామి క్షేత్రం' కనిపించింది. కడప - కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఆవిర్భవించిన ఈ స్వామిని దర్శించడానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతోనే ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా చెబుతారు. బలమైన ఆయన సంకల్పం కారణంగానే ఆ రోజున చిన్నపాటి ఆశ్రమంలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం, నేడు భారీ నిర్మాణంగా కనిపించే భవనంలో కొనసాగుతోంది.
ఆనాటి నుంచి ఇక్కడి అన్నదానం రోజంతా కొనసాగుతూనే ఉండటం విశేషం. ప్రశాంతమైన వాతావరణంలో ... ప్రకృతి ఒడిలో జరుగుతోన్న ఈ అన్నదాన కార్యక్రమం ... వనభోజనాలను తలపిస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించకుండా తిరిగివెళ్లరు. ఇక్కడి నరసింహుడు ఆవేదనను తీరుస్తాడనీ ... కాశినాయన ఆకలి తీరుస్తాడని చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కాశినాయన సమాధి చెందిన ప్రదేశాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు.
ఇదే ప్రాంగణంలో కొలువైన సీతారాములను ... రాధాకృష్ణులను ... శివపార్వతులను భక్తులు పూజిస్తారు. కాశినాయని ఆశయానికి అనుగుణంగా సాగుతోన్న ఈ అన్నదానానికి భక్తులు భారీగా సహాయ సహకారాలను అందిస్తుంటారు. నరసింహస్వామి అనుగ్రహాన్ని ... కాశి నాయన ఆశీస్సులను పొందుతుంటారు.
ఆయన ఆలోచనలకు తగిన ప్రదేశంగా నల్లమల అడవులలోని 'జ్యోతి నరసింహస్వామి క్షేత్రం' కనిపించింది. కడప - కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఆవిర్భవించిన ఈ స్వామిని దర్శించడానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతోనే ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా చెబుతారు. బలమైన ఆయన సంకల్పం కారణంగానే ఆ రోజున చిన్నపాటి ఆశ్రమంలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం, నేడు భారీ నిర్మాణంగా కనిపించే భవనంలో కొనసాగుతోంది.
ఆనాటి నుంచి ఇక్కడి అన్నదానం రోజంతా కొనసాగుతూనే ఉండటం విశేషం. ప్రశాంతమైన వాతావరణంలో ... ప్రకృతి ఒడిలో జరుగుతోన్న ఈ అన్నదాన కార్యక్రమం ... వనభోజనాలను తలపిస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించకుండా తిరిగివెళ్లరు. ఇక్కడి నరసింహుడు ఆవేదనను తీరుస్తాడనీ ... కాశినాయన ఆకలి తీరుస్తాడని చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కాశినాయన సమాధి చెందిన ప్రదేశాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు.
ఇదే ప్రాంగణంలో కొలువైన సీతారాములను ... రాధాకృష్ణులను ... శివపార్వతులను భక్తులు పూజిస్తారు. కాశినాయని ఆశయానికి అనుగుణంగా సాగుతోన్న ఈ అన్నదానానికి భక్తులు భారీగా సహాయ సహకారాలను అందిస్తుంటారు. నరసింహస్వామి అనుగ్రహాన్ని ... కాశి నాయన ఆశీస్సులను పొందుతుంటారు.