శ్రీ దత్తానుగ్రహం
అజ్ఞానమనే చీకటి అలుముకుని ఉన్నంత వరకూ ఆ చీకటికి అవతల ఏవుందనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆలోచనే కలగదు. అలాంటి ఆలోచన కలగనంత వరకూ ఆ చీకటికి అవతల ఏమీలేదనే అనిపిస్తుంది. అయితే అజ్ఞానమనే చీకటిని తరిమివేయడానికి జ్ఞానమనే కాగడా వెలిగించాలి. ఆ వెలుగు ముందుకు దారి చూపుతుంది ... అనుకున్న గమ్యానికి చేరుస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరికీ గురువు సహకారం అవసరం.
మానవుడిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన భిక్షను ప్రసాదించే శక్తి ఒక్క గురువుకి మాత్రమే వుంటుంది. జ్ఞానం వల్లనే ప్రతి ఒక్కరూ నిజానిజాలను గుర్తించగలుగుతారు ... తమ గురించి తాము తెలుసుకోవడమే కాకుండా దైవం యొక్క తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా అనేకమంది దేవతల నుంచి సామాన్య మానవుల వరకూ జ్ఞాన భోద చేశాడు శ్రీ దత్తాత్రేయస్వామి.
అందుకే శ్రీ దత్తాత్రేయుడిని విశ్వ గురువుగా అంతా ఆరాధిస్తుంటారు ... ఆయన జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మిగతా ఆలయాలతో పోలిస్తే శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయాలు తక్కువగానే కనిపిస్తాయి. అందువలన ఆయన ఆవిర్భవించిన క్షేత్రాలు ... కొంత కాలంపాటు తపస్సు చేసుకున్న ప్రదేశాలు ... తన అవతారాలుగా చెప్పబడుతోన్న అవధూతల ఆలయాలను భక్తులు దర్శించి తరిస్తుంటారు.
ఈ నేపథ్యంలో 'పిఠాపురం' ... 'కురువపురం' ... 'గాణుగాపురం' ... 'నెరవాడ' ... ' షిరిడీ' వంటి క్షేత్రాలు ఈ జాబితాలో కనిపిస్తాయి. ఇక ఇటీవల కాలంలో ప్రతి శిరిడీ సాయిబాబా మందిరంలోను శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠిస్తూ వుండటం వలన స్వామిని దర్శించే అవకాశం ... అదృష్టం అందరికీ లభిస్తోంది. దత్త జయంతి రోజున అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
స్వామివారికి సంబంధించిన పీఠాలలో ఆయన పాదుకలను దర్శించాలి ... అవకాశం వుంటే వాటిని శిరస్సుతో స్పర్శించాలి. స్వామి కొలువైన తీరంలో గల నదులలో స్నానం ఆచరించి, మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. వీలుంటే స్వామి ప్రతిమకు పాదసేవగా ఆయన కాళ్లను వత్తడం చేయాలి. ఈ విధంగా చేయడం వలన అజ్ఞానం అంతరించి జ్ఞానం వికసిస్తుంది. జన్మజన్మలుగా వెంటాడుతూ వస్తోన్న పాపాలు ... శాపాలు ... దోషాలు ... దారిద్ర్యం నశిస్తాయి. అనారోగ్యాలు ... ఆపదలు తొలగి సకల శుభాలు చేకూరతాయి.
మానవుడిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన భిక్షను ప్రసాదించే శక్తి ఒక్క గురువుకి మాత్రమే వుంటుంది. జ్ఞానం వల్లనే ప్రతి ఒక్కరూ నిజానిజాలను గుర్తించగలుగుతారు ... తమ గురించి తాము తెలుసుకోవడమే కాకుండా దైవం యొక్క తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా అనేకమంది దేవతల నుంచి సామాన్య మానవుల వరకూ జ్ఞాన భోద చేశాడు శ్రీ దత్తాత్రేయస్వామి.
అందుకే శ్రీ దత్తాత్రేయుడిని విశ్వ గురువుగా అంతా ఆరాధిస్తుంటారు ... ఆయన జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మిగతా ఆలయాలతో పోలిస్తే శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయాలు తక్కువగానే కనిపిస్తాయి. అందువలన ఆయన ఆవిర్భవించిన క్షేత్రాలు ... కొంత కాలంపాటు తపస్సు చేసుకున్న ప్రదేశాలు ... తన అవతారాలుగా చెప్పబడుతోన్న అవధూతల ఆలయాలను భక్తులు దర్శించి తరిస్తుంటారు.
ఈ నేపథ్యంలో 'పిఠాపురం' ... 'కురువపురం' ... 'గాణుగాపురం' ... 'నెరవాడ' ... ' షిరిడీ' వంటి క్షేత్రాలు ఈ జాబితాలో కనిపిస్తాయి. ఇక ఇటీవల కాలంలో ప్రతి శిరిడీ సాయిబాబా మందిరంలోను శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠిస్తూ వుండటం వలన స్వామిని దర్శించే అవకాశం ... అదృష్టం అందరికీ లభిస్తోంది. దత్త జయంతి రోజున అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
స్వామివారికి సంబంధించిన పీఠాలలో ఆయన పాదుకలను దర్శించాలి ... అవకాశం వుంటే వాటిని శిరస్సుతో స్పర్శించాలి. స్వామి కొలువైన తీరంలో గల నదులలో స్నానం ఆచరించి, మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. వీలుంటే స్వామి ప్రతిమకు పాదసేవగా ఆయన కాళ్లను వత్తడం చేయాలి. ఈ విధంగా చేయడం వలన అజ్ఞానం అంతరించి జ్ఞానం వికసిస్తుంది. జన్మజన్మలుగా వెంటాడుతూ వస్తోన్న పాపాలు ... శాపాలు ... దోషాలు ... దారిద్ర్యం నశిస్తాయి. అనారోగ్యాలు ... ఆపదలు తొలగి సకల శుభాలు చేకూరతాయి.