దేశంలోనే మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీని ములుగులో నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వం

Related image

PRESS NOTE

                                                             హైదరాబాద్: 27 సెప్టెంబర్,2022.

*దేశంలోనే మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీని ములుగులో నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వం
*రష్యా, చైనా తర్వాత ప్రపంచంలో ఫారెస్ట్ యూనివర్సిటీ మన ములుగు లోనే ఉన్నది
*పర్యావరణo, అటవీ సంరక్షణపైన ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు
*సకల సౌకర్యాలు, అన్ని హంగులతో యూనివర్సిటీగా రూపాంతరం చెందుతున్న ఫారెస్ట్ కాలేజీ
*అసెంబ్లీ ఆమోదం తర్వాత పాలనా పరమైన నిర్ణయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రాష్ట్రం లో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ఇ నిస్టిట్యూట్ (FCRI) ను 2016లో నెలకొల్పారు. ఇప్పడు అదే కాలేజీ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ అవుతోంది. 

హైదరాబాద్స మీపంలో ములుగు వద్ద అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక భవనాలతో పాటు అటవీ విద్యకు అవసరమైన అన్ని హంగులతో ఇప్పటికే క్యాంపస్ సిద్దంగా ఉంది. 2016 లో మొదట దూలపల్లి ఫారెస్ట్అ కాడెమీలో ప్రారంభమైన కాలేజీ, ముఖ్యమంత్రి  చొరవతో హైదరాబాద్ సమీపంలో ఉన్న ములుగు క్యాంపస్ కు మారింది. దేశంలోని ఏ యూనివర్సిటీ, కాలేజీ క్యాంపస్ లకు తీసిపోని విధంగా, సర్వ హంగులు, ఆధునిక సౌకర్యాలతో ఫారెస్ట్ కాలేజీ కొనసాగుతోంది. ఇప్పుడు యూనివర్సిటీగా మార్పుతో ఇదే ఫారెస్ట్ కాలేజీ, దేశంలోనే మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీగా మారబోతోంది. అందుకు అవసరమైన మౌళిక సదు పాయాలు, పాలన, నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులు, జీవవైవిధ్యానికి పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అటవీవిద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే ఈ క్యాంపస్ నుంచే జాతీయ స్థాయి పర్యావరణ నిపుణులు, అఖిల భారత స్థాయి అధికారులు రావాలనేది సీ.ఎం ఆకాంక్ష. అందుకు తగినట్లుగానే మొదటి బ్యాచ్నుం చి ఇప్పటి వరకు బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన విద్యార్థులు అటు అమెరికా యూనివర్సిటీలతో పాటు, దేశంలోనే పేరెన్నిక గల డెహ్రాడూన్ ఫారెస్ట్ రీసెర్చ్ఇ నిస్టిట్యూట్, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఐకార్ లాంటి చోట్ల ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవలే ఒక విద్యార్థి ఐ.ఎఫ్.ఎస్ కూడా సాధించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీగా (హరితహారం) మొదటి నుంచి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక వర్గీస్, ఫారెస్ట్కా లేజీ డీన్ గాను కొనసాగుతున్నారు. తన పర్యవేక్షణలో కాలేజీ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించటంతో పాటు, ఇప్పుడు దేశంలోనే మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీగా మారబోతోంది. పచ్చదనం పెంపు, పర్యావరణ హిత రాష్ట్రం కోసం తెలంగాణకు హరితహారం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి, చాలా ముందు చూపుతో ఫారెస్ట్ కాలేజీని నెలకొల్పారని, ఇప్పుడు యూనివర్సిటీగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేయటం గొప్ప విషయ మని ప్రియాంక వర్గీస్ అన్నారు. అటవీ విద్యకు ప్రాధాన్యత పెరగటంతో పాటు, గ్రామీణ యువతకు మంచి అవకాశాలు దక్కు తాయన్నారు.అటవీ విశ్వవిద్యాలయానికి శాసన సభ, శాసన మండలి ఆమోదం తెలిపింది. దేశ అటవీ విద్యలో ఇది చారిత్రాత్మక ఘట్టం. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ప్రత్యేకతలు, అటవీ విశ్వవిద్యాలయము (UoF), తెలంగాణ చట్టం, 2022 దేశంలోనే మొట్టమొదటిది.


ప్రపంచంలో మూడవ అటవీ యూనివర్సిటీ. రష్యా, చైనా తర్వాత మూడవది భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థని (FCRI) అటవీ విద్య, పరిశోధన, విస్తరణ మరియు ఫలితాలను ప్రజలకు చేరువ కావడం కోసం ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ దిశగా, అటవీ కళాశాల పరిశోధన సంస్థ, హైదరాబాద్‌ను పూర్తి స్థాయి “అటవీ విశ్వవిద్యాలయం(UoF)” గా ఈ క్రింది అంశాలతో ప్రత్యేక చట్టం ద్వారా రూపొందించాలని ప్రతిపాదించబడింది: అటవీ వనరుల సంరక్షణ- స్థిరమైన నిర్వహణ కోసం అర్హత కలిగిన అటవీ నిపుణులను తయారు చేయడం.

  పరిశోధనలను ప్రోత్సహించడం- చెట్ల పెంపకానికి తగిన పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలు మరియు ప్రజల అవసరాలు తీర్చడం. వివిధ వ్యవసాయ-పర్యావరణ పరిస్థితులకు అనువైన వ్యవసాయ- అటవీ నమూనాలను అభివృద్ధి చేయడం, సంప్రదాయ అటవీ కార్యకలాపాలే కాకుండా, సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించడం, వ్యవసాయ వర్గాల ఆర్థిక అభి వృద్ధి మరియు పర్యావరణ పరిస్థితులను పెంపొందించడం. సారూప్య సంస్థలతో అనుబంధం మరియు భాగస్వామ్యం ద్వారా
విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవడం. పరిశోధనా ఫలితాలను రైతులకు విస్తరణ శిక్షణ ద్వారా అందించడాన్ని ప్రోత్సహించడం. అటవీ విశ్వ విద్యాలయం (UOF), తెలంగాణ" స్థాపన అటవీ శాఖ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన అటవీ నిపుణులను తయారు చేస్తుంది

అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థను యూనివర్శిటీగా రూపొందించిన తర్వాత అదనంగా పీహెచ్‌డీ (PhD) కోర్సులు, పట్టణ
అటవీ వనాలు, నర్సరీ మేనేజ్‌మెంట్, అగ్రో ఫారెస్ట్రీ, గిరిజన జీవనోపాధి పెంపుదల, ఫారెస్ట్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, క్లైమేట్ స్మార్ట్ ఫారెస్ట్రీ ఫారెస్ట్ పార్క్స్మే నేజ్‌మెంట్‌లో డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించడానికి నిర్ణయించడమైనది.ఫలితంగా, విద్యార్థుల సంఖ్య ప్రస్తుత సంఖ్య 366 కు అదనంగా 360 పెరిగి 726 కి చేరుతుంది. ఉద్యోగుల సంఖ్య ప్రస్తుత సంఖ్య 118 కు అదనంగా 92 పెరిగి 210 కి చేరుతుంది. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఉంటారు. ఛాన్సలర్ గారు వైస్ఛా న్సలర్ ను నియమిస్తారు.

తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం బహుముఖ విధానాల ద్వారా హరిత వనాలను పెంపొందించడానికి కట్టుబడి ఉంది.
రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణకు హరిత హారం" కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా చేపట్టింది.

ఇది ప్రభుత్వం యొక్క అత్యంత విజయవంతమైన కార్యక్రమాలలో ఒకటి మరియు భారతదేశం నలుమూలల నుండి, విదేశాల
నుండ విస్తృతమైన ప్రశంసలు శిక్షణ పొందిన, అర్హతలు కలిగిన అటవీ నిపుణుల లభ్యత ఈ బృహత్తర కార్యక్రమాన్ని చాలా కాలం పాటు విజయవంతం చేయడంలో దోహదపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణకు హరిత హారం" కార్యక్రమం క్రింద ఇప్పటి వరకు 268.83 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క నిరంతర కృషి కారణంగా, రాష్ట్రంలో పచ్చదనం 7.7 % మరియు అటవీ విస్తీర్ణం 6.85 % పెరిగింది.
=============================================================
శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్జా రీచేయనైనది.

More Press Releases