రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలు

Related image

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలు పీపుల్స్ ప్లాజా లో పాల్గొన్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సి.ఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 16 : తెలంగాణా జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజక వర్గాల్లో అత్యంత ఉత్సాహంగా జాతీయ సమైఖ్యతా ర్యాలీలు జరిగాయి. ఆయా నియోజక వర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పతాకాలను ధరించి కొనసాగిన ఈ ర్యాలీలు కన్నుల పండుగగా జరిగాయి. అనంతరం ఆయా నియోజక కేంద్రాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించి భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం కలయిక కు దారితీసిన పరిస్థితులు, అనంతర కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల అమలు పై సంబంధిత ప్రజాప్రతినిధులు వివరించారు.. అనంతరం, అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా లో పాల్గొన్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సి.ఎస్. సోమేశ్ కుమార్తె లంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల సందర్బంగా ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన సమైక్యతా ర్యాలీలో రాష్ట్ర మంత్రులు తలసాని

    శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, జీహెచ్ఎం సీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్కు మార్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం పీపుల్స్ ప్లాజా లో జరిగిన బహిరంగ సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణాకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17 నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించు కున్నామని, ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితి ని దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయానికి భారత రత్న బీఆర్అం బెడ్కర్ పేరుపెట్టడం ద్వారా సి.ఎం. కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 చాలా ముఖ్యమైన రోజు. అంతకు ముందు నిజాం ప్రభుత్వం ఉండేది. మిగతా ప్రాంతాల్లోగా మనకు అంత సులభంగా స్వాతంత్య్రం రాలేదు. పెద్ద ఉద్యమం...చాలామంది ప్రాణాలు కోల్పోయాక మనకు స్వాతంత్య్రం వచ్చింది. నిజాం మంచి రాజు. భారత దేశంలో హైదరాబాద్ విలీనం కావాలని నెహ్రూకు లేఖ రాశారు. ఖాసీం రజ్వీ లాంటి వాళ్ళు వ్యతిరేకించినా ఆయనను జైల్లో పెట్టి స్వాతంత్య్రం ఇచ్చారు. దేశానికి గాంధీ ఎలాగో...తెలంగాణ కు గాంధీ కేసీఆర్. దేశానికి తెలంగాణ మోడల్దే శానికే ఆదర్శం; అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్మా ట్లాడుతూ, తెలంగాణలో జాతీయ సమైక్యతా వజ్రొత్సవాలు

    జరుపుతున్నాం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలో 15 వేల మంది ర్యాలీలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 17 అందరికీ అవగాహన కలగాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా పురోగతి సాధిస్తోంది; అని తెలిపారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడంతో..కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. పార్లమెంట్ కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు. ఈ సందర్బంగా నిర్వ్హయించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, జీహెచ్ ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరైన వారితో కలసి సామూహిక బోజనాలను చేశారు.

              ---------------------------------------------------------------------------------------------------------------------------------

More Press Releases