బెజవాడలో దాండియా, గార్భా : ఎనిమిది నుండి వర్క్ షాప్

Related image

దాండియా, గార్భా మెగా ఈవెంట్ 8 నుండి జ్యోతి కన్వేన్షన్ సెంటర్ లో కార్యశాల దసరా సందర్భంగా మెగా ప్రదర్శన నిపుణత ప్రదర్శించిన శిక్షణార్ధులకు బహుమతులు
 
 విజయవాడ: గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాల రిజిస్ట్రేషన్లకు మంచి స్పందన లభిస్తుందని  క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్ర్ర్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా, వర్క్ షాపును ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వేన్షన్ సెంటర్లో  ఉదయం 11గంటల నుండి ఒంటి గంట వరకు, సాయంత్రం 4గంటల నుండి  రాత్రి 9 గంటల వరకు సాగే శిక్షణలో ఏదేని గంట నిడివిని ఔత్సాహిక కళాకారులు ఎంపిక చేసుకుని శిక్షణ పొందవచ్చన్నారు.  ప్రధాన ప్రయోజకులుగా జిఎం మాడ్యులర్  వ్యవహరిస్తుండగా, 8,9 తేదీలలో సాయంత్రం ఆరుగంటలకు ప్రత్యేక దాండీయా ప్రదర్శన ఉంటుందన్నారు. సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను  ఆంధ్రప్రదేశ్ కు  పరిచయం చేసే క్రమంలో తాము ఈ వర్క్ షాపును నిర్వహిస్తున్నామన్నారు.

దసరా వేడుక సందర్భంగా జరిగే  మెగా ఈవెంట్ లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారులు పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందిస్తారని సుమన్ మీనా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8008268885, 8121135980 నెంబర్లతో సంప్రదించవచ్చని నేహా జైన్ తెలిపారు. మెగా ఈవెంట్ ప్రవేశం కోసం ఎంట్రీ టిక్కెట్లను జ్యోతి కన్వెన్షన్ సెంటర్ నుండి ప్రతి రోజూ సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు పొందవచ్చని , 23వ తేదీ సాయంత్రం వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. శిక్షణ కోసం గుజరాత్ నుండి ప్రత్యేకంగా శిక్షకులు వస్తున్నారని నిర్వాహకులు వివరించారు. కళలతో దేశసమైఖ్యతను చాటేలా గుజరాతీ, రాజస్ధానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మూడు సంవత్సరాల పాటు నగర వాసులు మంచి సహకారం అందించారన్నారు.

 కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు విరామం తీసుకోగా, ప్రస్తుతం నాలుగో ఎడిషన్ కు సన్నద్దం అవుతున్నామని నేహా జైన్ వివరించారు. విజయవాడ యువత కోసం ప్రత్యేకంగా 15 రోజుల పాటు దాండియా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.  ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు బహుమతులను అందిస్తున్నామన్నారు. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని సుమన్ మీనా వివరించారు.

More Press Releases