*ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపలి శ్రీనివాస్*

Related image

ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా 54 వ డివిజన్ లో శనివారం నిర్వహించిన హర్ ఘర్ తీరంగా కార్యక్రమములో మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వెల్లంపలి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు శ్రీ ఎం.డీ రుహుల్లా, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్ అధికారులు పాల్గొన్నారు.తదుపరి 54 వ డివిజన్ లోని పంజా సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు హర్ ఘర్ తీరంగా అను నినాదాన్ని ప్రారంభించి మునిసిపల్ హై స్కూల్ విద్యార్థుల చేత విద్యార్ధులతో కలసి కాలి నడకన జాతీయ జండాను భారత దేశము శాస్త్ర సాంకేతిక సంపద అభివృద్ధి అనే అంశంపై ర్యాలీ నిర్వహించారు. అంతరిక్ష పరిశోధనలో భారత దేశము ప్రపంచంలోనే ముందు స్థానంలో ఉండటాన్ని విద్యార్థులు వందేమాతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించారు

అదే విధంగా ఆగస్టు 15 వ తేదీనా శాసన సభ్యులు శ్రీ వెల్లంపలి శ్రీనివాసరావు గారి పుట్టిన రోజు సందర్బంగా ముందుగా శాసన మండలి సభ్యులు శ్రీ ఎం.డీ రుహుల్లా, స్థానిక డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్ గారితో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచడం జరిగినది.

కార్యక్రమములో జోనల్ కమిషనర సుధాకర్, శానిటరీ సూపర్ వైజర్ ఆర్.ఒబేశ్వరరావు పాటుగా మరియు ఇతర అధికారులు సిబ్బంది హాజరుకాగా వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు ఎన్.సి.సి విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా జాతీయ జండాలతో హర్ ఘర్ తీరంగా కార్యక్రమములో పాల్గొన్నారు.

     

More Press Releases