Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 1,771 కరోనా కేసులు

  • రాష్ట్రంలో మరో 1,20,525 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 171 మందికి కరోనా
  • అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 2 కేసులు
  • ఇంకా 22,133 మందికి కొనసాగుతున్న చికిత్స
Telangana corona update

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నిదానించింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,771 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 171 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 157, ఖమ్మం జిల్లాలో 149, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 107, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 2 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,384 మంది కరోనా నుంచి కోలుకోగా... 13 మంది మృతి చెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,469కి పెరిగింది.  తెలంగాణలో ఇప్పటివరకు 6,02,089 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,76,487 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,133 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News