Anu Emmanuel: 'మహాసముద్రం'లో మరో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్

  • శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ పోషిస్తున్న మహాసముద్రం
  • ఇప్పటికే ఓ కథానాయికగా అదితి రావు హైదరీ
  • ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న మహాసముద్రం
Anu Emmanuel plays another female lead role in Mahasamudram

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న మహాసముద్రం చిత్రంలో ప్రధాన తారాగణం పేర్లను ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఏకే ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితి రావు హైదరీ ఇప్పటికే ఓ కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం మహాసముద్రం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News