: ఇసుక తవ్వకాలు చంద్రబాబుకు తెలియదనడం సరి కాదు: పురందేశ్వరి

ఇసుక తవ్వకాల గురించి తనకు తెలియదని సీఎం చంద్రబాబు అనడం సరికాదని, ఆయన తీసుకుంటున్న చర్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా ఇన్ చార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇసుక మాఫియా రోజు రోజుకీ రెచ్చిపోతోందని, అన్ని నదులను మాఫియా తవ్వేస్తోందని అన్నారు. ఒక వైపు ఉచిత ఇసుక ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. మరో వైపు, లారీలతో ఇసుక అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు.

More Telugu News