: ఫేస్బుక్లో తప్పుడు పోస్ట్ చేసినందుకు మహిళకు భారీగా జరిమానా!
తన స్నేహితురాలే లక్ష్యంగా ఫేస్బుక్లో తప్పుడు పోస్టు చేసిన జాక్వలిన్ హమ్మండ్ అనే మహిళకు అమెరికాలోని ఓ కోర్టు భారీగా జరిమానా విధించింది. తనను టార్గెట్ చేస్తూ చేసిన పోస్టుపై డావ్నీ డయల్ అనే మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేయడంతో రెండేళ్లు విచారణ జరిపిన కోర్టు ఆ పోస్టు చేసిన జాక్వలిన్ హమ్మండ్కు ఐదు లక్షల డాలర్ల భారీ జరిమానా విధించింది.
పూర్తి వివరాలు చూస్తే... జాక్వలిన్ హమ్మండ్, డావ్నీ డయల్ రెండేళ్ల క్రితం మంచి స్నేహితులు. వీరిద్దరు ఓ రేడియోలో పనిచేసేవాళ్లు. అయితే, ఆ రేడియో సంస్థ నిర్వహణ వ్యవహారంలో వారిరువురి మధ్య గొడవ చెలరేగింది. కాగా, కొన్నేళ్ల క్రితం డావ్నీ డయల్ కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ మరణవార్తకు సంబంధించి హమ్మండ్ ఫేస్బుక్లో ఓ వివాదాస్పద పోస్ట్ చేసింది. దీంతో కోర్టు ఆమెకు భారీగా జరిమానా విధించింది.