: భారతీయ రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా బీపీ కనుంగో

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బీపీ కనుంగో నియమితులయ్యారు. ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆయన ఏప్రిల్ 3న పదవి చేపట్టి మూడేళ్లపాటు కొనసాగుతారు. కనుంగో నియామకాన్ని క్యాబినెట్ నియామకాల బృందం(ఏసీసీ) ఆమోదించింది. గతేడాది మార్చిలో కనుంగో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కాగా సన్ ఫార్మాస్యూటికల్స్ ప్రమోటర్ దిలీప్ సంఘ్వీని ఆర్బీఐ పశ్చిమ స్థానిక బోర్డు సభ్యుడిగా ఏసీసీ ఎంపిక చేసింది. సంఘ్వీ నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

More Telugu News