: కూలర్ల కంపెనీ యజమాని స్పందించకపోవడం వల్లే కార్మికుల మృతి!

హైదరాబాద్, అత్తాపూర్ లోని ఏవీ 1 కూలర్ల గోడౌన్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. చనిపోయిన కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గోడౌన్ కు బయట వైపు తాళం వేసి ఉన్నా, దాని లోపల ఉన్న కార్మికులు మాత్రం రాత్రి సమయంలో పని చేస్తున్నారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

అయితే, ఈ సమాచారాన్ని యజమాని ప్రదీప్ కు కార్మికులు ఫోన్ చేసి చెప్పారు. తాళం లేదని ప్రదీప్ చెప్పడంతో కార్మికులు అక్కడి స్థానికులకు ఈ సమాచారం చెప్పారు. స్థానికులు దుకాణం షట్టర్ పగులగొట్టి లోపలికి వెళ్లే సరికే ఐదుగురు కార్మికులు కాలి బూడిదై పోయారు. మృతులు ఇర్ఫాన్, సద్దాం, సాధు, అయూబ్ ఖాన్ గా గుర్తించారు. ఈ సంఘటనలో మృతి చెందిన మిగిలిన కార్మికుల పేర్లు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News