utham kumar reddy: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ తన తీరును మార్చుకోవాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో నిన్న కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ మధుసూదనాచారి తీసుకున్న ఈ నిర్ణ‌యంపై టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. స్పీక‌ర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులపై మాట్లాడితే స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. స్పీకర్ మ‌ధుసూద‌నాచారి త‌న ధోర‌ణిని మార్చుకోక‌పోతే ఆయ‌న‌పై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని అన్నారు.  

More Telugu News