: బహు భార్యత్వం ముస్లింల కంటే హిందువుల్లోనే ఎక్కువగా ఉంది: జైపాల్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బహు భార్యత్వం ముస్లింల కంటే హిందువుల్లోనే ఎక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ మతంలోని మహిళలపై జరుగుతున్న వేధింపులను తొలుత అరికట్టాలని, ఆ తర్వాతే ముస్లిం మహిళా సమస్యలపై మాట్లాడాలంటూ బీజేపీకి సూచించారు. ప్రజలను విభజించేలా బీజేపీ పాలన సాగుతోందని ఆరోపించారు. భారత జవాన్లను ఇజ్రాయెల్ సైనికులతో పోల్చడం ద్వారా మన వాళ్లను మోదీ అవమానించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షాన నిలబడుతుందని తెలిపారు.

More Telugu News