: పొన్నం ప్రభాకర్ ఆమె కాళ్లుపట్టుకున్నారంటూ.. ఉండవల్లి మరీ వ్యంగ్యంగా రాశారు: జైపాల్ రెడ్డి

విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకున్నారంటూ ఉండవల్లి తన పుస్తకంలో రాయడం మరీ వ్యంగ్యంగా ఉందని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. ఉండవల్లి రాసిన ‘విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకంలోని కొన్ని అంశాలపై ఆయన స్పందిస్తూ..విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో నాడు హౌస్ ప్రసారాలను నిలిపివేయమని తాను చెప్పలేదని అన్నారు. ప్రసారాలు నిలిపివేయడానికి, విభజన బిల్లు ఆమోదింపజేయడానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. హౌస్ ప్రసారాలను నిలిపివేయడమనేది స్పీకర్ వివేచనపై ఆధారపడి ఉంటుందన్నారు. బహుశ హౌస్ లో పెప్పర్ స్ప్రే కొట్టినందునే, నాడు ప్రసారాలను నిలిపివేసి ఉంటారని తాను భావిస్తున్నానని జైపాల్ రెడ్డి అన్నారు.

More Telugu News