: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో ఇంగ్లాండుపై టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. టైటిల్ ను కైవసం చేసుకునేందుకు రెండు దేశాల జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎటువంటి మార్పులు లేకుండా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ పిచ్ ఛేజింగ్ కు అనుకూలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News