: ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీకి సమీపంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు వచ్చినట్టు సమాచారం. అంతేగాక ఉత్తర భారతదేశంలోని లక్నో, కోల్ కతా ఇంకా కొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. భయంతో జనం ఒక్కసారిగా ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఢిల్లీలో మెట్రో రైళ్లను అధికారులు రద్దు చేశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. ఖాట్మండుకు 83 కిలో మీటర్ల దూరంలో భూప్రకంపన కేంద్రంను గుర్తించినట్టు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

More Telugu News