Amity University: అమిటీ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థిని 60 చెంపదెబ్బలు కొట్టిన సహ విద్యార్థులు!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అమిటీ యూనివర్సిటీలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేసి, దాదాపు 60 చెంపదెబ్బలు కొట్టారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, లక్నో అమిటీ క్యాంపస్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న షికార్ ముఖేశ్ కేసర్వానీపై ఆగస్టు 26న యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో ఈ దాడి జరిగింది. ఇటీవలే కాలికి లిగమెంట్ సర్జరీ చేయించుకున్న షికార్, ఊతకర్రల సాయంతో నడుస్తుండగా అతనిపై దాడికి పాల్పడ్డారు. ఇద్దరు అమ్మాయిల గురించి షికార్ అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో ఆయుష్ యాదవ్, జాహ్నవి మిశ్రా అనే విద్యార్థులు ప్రధానంగా పాల్గొన్నారని, మిగతా వారు వీడియో తీశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడి సమయంలో షికార్ ఫోన్‌ను కూడా పగలగొట్టిన నిందితులు, ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనతో షికార్ తీవ్ర మానసిక ఆందోళనకు గురై, కాలేజీకి వెళ్లడం మానేశాడు.

బాధితుడి తండ్రి ముఖేశ్ కేసర్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయుష్ యాదవ్, జాహ్నవి మిశ్రాతో పాటు మిలయ్ బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమాన్ శుక్లా అనే మరో ముగ్గురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తన కుమారుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ తీవ్ర ఘటనపై అమిటీ యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 
Amity University
Shikar Mukesh Kesarwani
Lucknow Amity Campus
student assault
ragging
Uttar Pradesh
Ayush Yadav
Jahnavi Mishra
college violence
law student

More Telugu News