వింబుల్డన్‌లో కోహ్లీ దంపతులు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్!

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి లండన్‌లోని ప్రఖ్యాత వింబుల్డన్ సెంటర్ కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. సోమవారం జరిగిన నోవాక్ జొకోవిచ్ నాలుగో రౌండ్ మ్యాచ్‌ను వారు ముందు వరుసలో కూర్చుని వీక్షించారు. అయితే, కోహ్లీ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే, కొందరు అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

కోహ్లీ ఇలా టెన్నిస్ మ్యాచ్ చూడటంపై కొందరు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 36 ఏళ్ల వయసులో జట్టుకు దూరమై, ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడకుండా ఇలా మ్యాచ్‌లు చూడటమేంటని ప్రశ్నించారు. "మేము మిమ్మల్ని ఇంగ్లండ్‌లో ఆడుతుండగా చూడాలనుకుంటే, మీరు అక్కడ కూర్చుని టెన్నిస్ చూస్తున్నారు, ఇది బాధాకరం" అని ఒక నెటిజన్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

మరికొందరు అభిమానులు కోహ్లీని 38 ఏళ్ల జొకోవిచ్‌తో పోలుస్తూ కామెంట్లు పెట్టారు. "38 ఏళ్ల వయసులో జొకోవిచ్ ఇంకా శ్రమిస్తుంటే, మీరు 36 ఏళ్లకే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. దయచేసి మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోండి" అంటూ మరొకరు రాసుకొచ్చారు.

ఈ ఏడాది మే 12న కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, కోహ్లీ జట్టులో ఉండి ఉంటే బాగుండేదని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆయన టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై ఉన్న అసంతృప్తిని ఇప్పుడు వింబుల్డన్ సందర్శన సందర్భంగా మరోసారి బయటపెడుతున్నారు.

Virat Kohli
Anushka Sharma
Wimbledon
Novak Djokovic
India Cricket
Test Retirement
England Cricket
Social Media
Cricket Fans

More Telugu News