ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వర్ష సూచన వెలువరించింది. ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా, శనివారం (రేపు) రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కొన్నిచోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఏపీఎస్‌డీఎంఏ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పందిస్తూ... ద్రోణి ప్రభావం వలన రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడరాదని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని ప్రఖర్ జైన్ భరోసా ఇచ్చారు.


More Telugu News