Gottimukkala Padma Rao: సీనియర్ వంశీ ఎవరిలోనూ కలవడు .. అదే ఆయన మైనస్: నిర్మాత గొట్టిముక్కల పద్మారావు

  • వంశీతో రెండు సినిమాలు చేశాను 
  • అన్ని విభాగాలపై ఆయనకి పట్టుంది
  • వంశీ తత్వమే అంత అని చెప్పిన గొట్టిముక్కల    

సీనియర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాలలో 'ఏప్రిల్ 1 విడుదల' ఒకటి. రాజేంద్రప్రసాద్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. అలాంటి ఈ సినిమాకి గొట్టిముక్కల పద్మారావు నిర్మాతగా వ్యవహరించారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "వంశీగారి దర్శకత్వంలో 'ఏప్రిల్ 1 విడుదల' .. 'జోకర్' సినిమాలు నిర్మించాను. వంశీ గారికి కథాకథనాలపైనే కాదు, సాంకేతికపరమైన విషయాల పైన కూడా మంచి అవగాహన వుంది. ఆయనలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా వున్నాడు. అయితే ఎటొచ్చీ, ఆయన ఎవరిలోనూ కలవడు .. ఎవరితో ఏ విషయాన్ని షేర్ చేసుకోడు. చాలా రిజర్వ్డ్ గా ఉంటూ తన పని తను చేసుకుపోతుంటాడు. నిర్మాతల సూచనలను కూడా ఆయన పట్టించుకోడు. తను అనుకున్నది చేసుకుంటూ వెళుతుంటాడు. ఎవరితోను ఫ్రీగా ఉండలేని ఆయన ధోరణి ఆయనకి మైనస్ అయింది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News