Nalgonda District: రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీం మేనకోడలు మృతి

  • నయీం మేనకోడలు శాహేదా సాజిద్
  • నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఘటన
  • లారీని ఢీ కొట్టిన ఆమె ప్రయాణిస్తున్న కారు

రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీం మేనకోడలు శాహేదా సాజిద్ మృతి చెందింది. నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా కేశరాజుపల్లి దగ్గర ఈ ప్రమాద ఘటన జరిగింది. లారీని ఆమె ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. 

More Telugu News