Tamilnadu: ప్రయాణికులకు లడ్డూలు ఇచ్చి.. చోరీలకు పాల్పడుతోన్న మహిళ

  • దేవుడి ప్రసాదం అంటూ లడ్డూలు చేతిలో పెడుతోన్న కిలేడీ
  • తిన్న వారు స్పృహ తప్పి పడిపోగానే నగలు, డబ్బు చోరీ
  • అరెస్టు చేసిన పోలీసులు  

దేవుడి ప్రసాదం అంటూ లడ్డూలు చేతిలో పెడుతుంది.. అవి తిన్న వారు స్పృహ తప్పి పడిపోతున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, నగలను కాజేసి పారిపోతుంది ఓ కిలేడీ. తమిళనాడులోని తిరుచ్చి సెంట్రల్‌ బస్టాండ్‌లో రాణి అనే మహిళ ఈ ఘటనలకు పాల్పడుతోంది. మోసపోయిన ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో చివరకు నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

తంజావూరు జిల్లా తిరువయ్యూరు, రంగనాథపురానికి చెందిన పార్వతి అనే మహిళ గతంలో ఓసారి తిరుచ్చి సెంట్రల్‌ బస్టాండ్‌ నుంచి బస్సులో పల్లడం వెళుతోంది. ఆ సమయంలో పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికురాలు రాణి ఆమెకు లడ్డూను ఇచ్చింది. దీంతో పార్వతి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత 8.5 సవర్ల నగలను అపహరించిన రాణి అక్కడి నుంచి పారిపోయింది. తిరుచ్చి నుంచి కోవైకు వెళ్లేందుకు తాజాగా బాధితురాలు అక్కడికి రాగా, నగలు చోరీ చేసిన రాణిని గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితురాలిని అరెస్టు చేశారు.

More Telugu News