Maharashtra: 36 మందితో 'మహా' కేబినెట్.. అజిత్ పవార్, ఆదిత్య థాకరేలకు చోటు

  • డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్
  • మంత్రిగా ప్రమాణం చేసిన ఆదిత్య థాకరే
  • అశోక్ చవాన్ కు చోటు

మహారాష్ట్రలో 'మహా' కేబినెట్ కొలువుదీరింది. 34 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు కూడా కేబినెట్ లో అవకాశం దక్కింది. మహారాష్ట్రలో అత్యధికంగా 43 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉంది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో అశోక్ చవాన్, దిలీప్ పాటిల్, ధనంజయ్ ముండే, అనిల్ దేశ్ ముఖ్, హసన్ ముష్రిఫ్, వర్షా గైక్వాడ్, రాజేంద్ర షింగానే, నవాబ్ మాలిక్, రాజేశ్ తోపే, నునిల్ కేదార్, సంజయ్ రాథోడ్, గులాబ్ పాటిల్, బాలాసాహెబ్ పాటిల్, అనిల్ పరబ్ తదితరులు ఉన్నారు.

More Telugu News