Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

  • సీఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములపై కీలక నిర్ణయం
  • ఆర్టీసీ విలీనం నిమిత్తం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు
  • తుని ఘటన సహా కాపు ఉద్యమంలో నమోదైన కేసుల ఉపసంహరణ 

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి, ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన అసైన్డ్ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపు రద్దుకు ఆమోదం తెలిపింది.  

- ఏపీ దిశ యాక్టు-2019 పేరిట కొత్త చట్టం

- గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణకు కొత్త శాఖ ఏర్పాటు

-  ఏపీఎస్సార్టీసీ విలీనం నిమిత్తం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విభాగం ఏర్పాటు. రవాణా, రోడ్లు, రహదారులు, భవనాలశాఖలోనే ఈ విభాగం ఏర్పాటు కానుంది.

- ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగ్గట్టుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో పోస్టుల ఏర్పాటుకు అంగీకారం.

- ఆర్టీసీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు కొనసాగింపునకు నిర్ణయం

- తుని ఘటన, కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణ

- భోగాపురం భూసేకరణ సందర్భంగా నమోదైన కేసుల ఎత్తివేతకు నిర్ణయం

- వైఎస్సార్ పెన్షన్ కానుక మార్గదర్శకాలకు ఆమోదం. గతంలో ఉన్న మార్గదర్శకాలు సవరణ. గ్రామీణ ప్రాంతాల్లో నెల ఆదాయం రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న వారికి, మూడు ఎకరాల పల్లం లేదా పది ఎకరాల్లోపు మెట్ట ..ఈ రెండూ కలిపి పది ఎకరాల లోపు ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు ఇల్లు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. సొంత కారు ఉన్న వారు, కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు.
   
- ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. రూ.101 కోట్లతో షేర్ క్యాపిటల్ తో ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

- ఆంధ్రప్రదేశ్ మిల్లెట్ బోర్డు చట్టం 2019 ముసాయిదా బిల్లుకు ఆమోదం. కరవు, వర్షాభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును పెంచేందుకు బోర్డు ఏర్పాటుకు, చిరుధాన్యాల బోర్డుల ఏర్పాటు ముసాయిదా బిల్లులకు ఆమోదం.

- ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ రుణ పరిమితి మరో రూ.3 వేల కోట్లు పెంచేందుకు ఆమోదం. ప్రస్తుత రుణ పరిమితి రూ.22 వేల కోట్లు.

- మద్యం అక్రమంగా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన శిక్షలు విధించేందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించిన నేరాలను నాన్-బెయిలబుల్ కేసులుగా ఈ బిల్లు పరిగణిస్తోంది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు. నేరం చేసి మొదటిసారి పట్టుబడితే విధించే జరిమానా రూ.2 లక్షలు, రెండోసారి పట్టుబడితే రూ.5 లక్షలు విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజు కన్నా రెండు రెట్లు జరిమానా విధిస్తారు. ఇదే తప్పు మరోసారి చేస్తే బార్ లైసెన్స్ రద్దు చేస్తారు.

- ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ అమెండమెంట్ బిల్-2019 కు ఆమోదం.

- ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (ఏపీపీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21-ఏ(1) (ఇ) సవరణకు ఆమోదం. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు నిమిత్తం 15 ఎకరాల 28 సెంట్ల భూమి కేటాయింపు.
 
- వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాల పెంపు

- అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీషు మీడియంలో బోధనకు ఆమోదం. తదుపరి సంవత్సరాల్లో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లీషు మీడియంలో బోధిస్తారు.

- ఏపీ స్టేట్ యూనివర్శిటీ యాక్టులో సవరణలకు ఆమోదం

- వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు. అదే యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటుకు ఆమోదం.  
 
- కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటు. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్, కేవీఆర్ గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లను విలీనం చేసి ఈ క్లస్టర్ వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం.

- ఏపీ సాంస్కృతిక విభాగం కమిషన్ చైర్మన్ గా వంగపండు ఉష  నియామకానికి ఆమోదం

More Telugu News