Rajasingh: హిందూమతం గురించి మాట్లాడితే ఖబడ్దార్: పవన్ కల్యాణ్ కు రాజాసింగ్ వార్నింగ్

  • హిందూమతం గురించి అవగాహన లేని మాటలు
  • పవన్ మరో మతానికి మారినట్టుంది
  • వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్

హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన, హిందూమతం, ధర్మం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఆయన మాట్లాడారని, ఆయన ఇతర మతానికి మారిపోయినట్టు అనిపిస్తోందని అన్నారు. లౌకికతత్వంపై కనీస అవగాహన లేని పవన్, తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోకుంటే, ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని అన్నారు. 'ఖబడ్దార్ పవన్‌' అంటూ కటువు వ్యాఖ్యలు చేశారు.

నిన్న పవన్ తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందూ రాజకీయ నేతలే మత రాజకీయాలు ఆడుతున్నారని, మతాల గొడవలు పెడుతున్నది కూడా వారేనని వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చాయి. తిరుమలలో అన్యమత ప్రచారం చేయిస్తున్నది కూడా హిందువులేనని పవన్ సంచలన విమర్శలు చేశారు. ఇతర మతాల వారెవరూ హిందూమతాన్ని కించపరచడం లేదని అన్నారు. సెక్యులరిజాన్ని ఇబ్బందులు పెడుతున్నది కూడా హిందూ నేతలేనని పవన్ అనడం తీవ్ర చర్చనీయాంశమైంది.

More Telugu News