Hyderabad: ఆ ఘటన అమానుషం: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యపై రాహుల్ గాంధీ

  • దిశపై జరిగిన అత్యాచారం, హత్యపై రాహుల్ ఆవేదన
  • ఒక మనిషి మరో మనిషిని క్రూరంగా హింసించి ఎలా చంపుతారు?
  • బాధిత కుటుంబానికి దేవుడు తగిన శక్తిని ప్రసాదించాలి

హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఒక మనిషి సాటి మనిషిపై ఇలాంటి అమానుషానికి ఎందుకు ఒడిగడతారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘హైదరాబాద్ లో జరిగిన ఈ అత్యాచారం, హత్య ఘటన విని నిర్ఘాంతపోయా. ఒక మనిషి ఇంకో మనిషిని అంత క్రూరంగా ఎలా చంపగలరు. ఇది ఊహించుకోవడానికి భీతిగొల్పుతోంది. ఈ సమయంలో బాధిత కుటుంబానికి దేవుడు తగిన శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్లు పోస్ట్ చేశారు.

More Telugu News