warangal: గంజాయి మత్తులో మునిగి తేలుతున్న వరంగల్ నిట్ విద్యార్థులు.. 11 మందిపై వేటు!

  • సస్పెండైన 11 మందిలో 9 మంది విదేశీ విద్యార్థులు
  • హాస్టల్ గదుల్లో గంజాయి తాగుతూ పట్టుబడిన వైనం
  • ఏడాదిపాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ

గంజాయి తాగుతూ పట్టుబడిన 11 మంది విద్యార్థులను వరంగల్ నిట్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన నిట్ అధికారులు గత నెల 27న హాస్టల్ గదుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. ఈ వ్యవహారంపై డీన్ నేతృత్వంలో విచారణ జరిపిన కమిటీ పట్టుబడిన 11 మంది విద్యార్థులు గంజాయి తాగినట్టు నిర్ధారించి నివేదిక సమర్పించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన నిట్ అధికారులు 11 మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. వేటు పడిన 11 మంది విద్యార్థుల్లో 9 మంది విదేశీ విద్యార్థులు కావడం గమనార్హం.

More Telugu News